1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (10:14 IST)

మా ఇద్దరికీ 'ఆ' సంబంధం ఉంది.. వేర్వేరుగా బతకలేకపోతున్నాం.. కలిసి చనిపోతున్నాం...

మా ఇద్దరికీ అక్రమం సంబంధం ఉంది. కట్టుకున్న భర్త కంటే.. నేను మనసు పడిన వ్యక్తి వద్దే హాయిగా సుఖం పొందుతున్నాను. అయినా మేమిద్దరం కలిసి బతికేందుకు ఈ సమాజం అంగీకరించదు.

మా ఇద్దరికీ అక్రమం సంబంధం ఉంది. కట్టుకున్న భర్త కంటే.. నేను మనసు పడిన వ్యక్తి వద్దే హాయిగా సుఖం పొందుతున్నాను. అయినా మేమిద్దరం కలిసి బతికేందుకు ఈ సమాజం అంగీకరించదు. అందుకే ఇద్దరం కలిసి చనిపోతున్నాం అంటూ ఓ వివాహిత, ఓ వివాహితుడు కలిసి సూసైడ్ లేఖ రాసి పెట్టి కనిపించకుండా పోయారు. గుంటూరు జిల్లా సంగడిగుంట ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గంటూరు జిల్లా స్వర్ణ భారతినగర్‌కు చెందిన ఓ మహిళకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే, ఇదే జిల్లా నగరాలుకు చెందిన ఆటో డ్రైవర్‌ గోపికి ఏడేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈ మహిళకు గోపితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
కుటుంబ సభ్యులకు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి హెచ్చరించారు. దీంతో ఇద్దరూ వెళ్లిపోవాలని నిర్ణయించుకొని శనివారం రాత్రి వారి తల్లులను ఉద్దేశించి ఇలా ఉత్తరాలు రాశారు. తాము కలసి బతకాలనుకున్నామనీ, కానీ ఆ పరిస్థితులు లేవనీ పేర్కొన్నారు. అందుకే చనిపోతున్నామనీ, తమ మృతదేహాల కోసం కూడా గాలించవద్దనీ రాశారు. దీనిపై నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.