1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మే 2024 (14:35 IST)

రైలు ఢీకొని అంగన్‌వాడీ కార్యకర్త, కుమారుడి మృతి

train
ఆదివారం కావలి రైల్వేస్టేషన్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, ఆమె కుమారుడు రైలు ఢీకొని మృతి చెందారు. మృతులు జిల్లాలోని సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బుట్టా సుభాషిణి (55), ఆమె కుమారుడు బుట్టా విజయ్ (19)గా గుర్తించారు. మృతురాలు సుభాషిణి చాగనం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. 
 
ఆమె స్వగ్రామానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావలి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్నికల విధులను కేటాయించారు. అందుకే కొడుకుతో కలిసి ఉదయం 10గంటల ప్రాంతంలో గూడూరు నుంచి రైలులో కావలికి వచ్చింది. 
 
వీరిద్దరూ కావలి రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నిస్తుండగా విజయవాడ నుంచి వేగంగా వస్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. కావలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.