శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (17:46 IST)

ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ అక్కసు.. యునిసెఫ్‌కు ఫిర్యాదు

బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రాపై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. ఐక్యరాజ్యసమితి సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్‌ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై తన కడపు మంటను వెళ్లగక్కుతూ యునిసెఫ్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్‌కు లేఖ రాశారు. 'జమ్మూకాశ్మీర్ విషయంలో ప్రియాంక చోప్రా భారత విధానాలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. ఆమె యూనిసెఫ్ రాయబారిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు' అని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. 
 
కాగా, ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక చోప్రాను ఓ పాకిస్థాన్ మహిళ..'భారత బలగాలు పాక్ పై వైమానిక దాడులు చేసినప్పుడు మీరు జైహింద్ అని ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉంటూ ఇలా ప్రవర్తించడం ఏంటి?' అని నిలదీసింది.'
 
దీనిపై ప్రియాంకా స్పందిస్తూ, పాకిస్థాన్‌లో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. పైగా, నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు గౌరవం ఉంది. నేను రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తావో., నేనూ నా దేశం తరపున అలాగే మాట్లాడతా. ఇలా అందరిలో అరిచి నీ పరువు పోగొట్టుకోకు అని ఘాటుగానే సమాధానమిచ్చింది.