1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (19:32 IST)

రణస్థలం వేదికగా జనసేన యువశక్తి - పోస్టర్ ఆవిష్కరించిన పవన్

yuvasakthi
జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ జరుగనుంది. స్వామి వివేకానందుడి స్ఫూర్తిగా తీసుకుని ఈ సభను నిర్వహిస్తున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ యువశక్తి సభకు సంబంధించిన పోస్టరును ఆయన సోమవారం ఆవిష్కరించారు. 
 
స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి యువతీ యువకులంతా ఆహ్వానితులేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని యువగళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందని తెలిపారు. 
 
దేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని చెప్పారు. అయితే, ఉత్తారాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధఇ అవకాశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొనివుందన్నారు. 
 
ఈ నేపథ్యంలో వలసలు, విద్య, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభలో తాము మాట్లాడటం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.