సంబంధిత వార్తలు
- తిరుమలలో కుమార్తెలతో పవన్ కల్యాణ్.. సమ్మక్క-సారక్కలా వున్నారే.. (video)
- తిరుపతిలో బహిరంగ సభ.. వారాహి డిక్లరేషన్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్
- అన్న ప్రాసనరోజే కత్తిపట్టిన శ్రీకళ్యాణ్ కుమార్ - కష్టపడే తత్వం వున్నవాడు : అంజనాదేవి ఇంటర్వ్యూ
- పవన్ కళ్యాణ్ కుమార్తెలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబం తిరుమల దేవదేవుడిని దర్శించుకున్న వేళ
- నాకు యోగిబాబు అంటే చాలా ఇష్టం.. తమిళంలో పవన్ స్పీచ్ (video)
పవన్కు అస్వస్థత - తిరుమల అతిథి గృహంలోనే వైద్య సేవలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్న ఆయన అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. ఆ సమంయలో ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జనసేనాని, రాత్రి తిరుమలోనే బస చేశారు. దాంతో అస్వస్థతకు గురైన ఆయన తిరుమలలోని అతిథి గృహంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు.
అనారోగ్యంతో ఉన్నా గురువారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో ఆయన పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. గురువారం సాయంత్రం తిరుపతి బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలోనే ఆయన వారాహి డిక్లరేషన్ అంశాలను బహిర్గతం చేయనున్నారు.
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. 11 రోజులపాటు సాగిన దీక్షను బుధవారం శ్రీవారి దర్శనం తర్వాత విరమించిన విషయం తెల్సిందే.
