సంబంధిత వార్తలు
- జమ్మూలో టీటీడీ ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన సుబ్బారెడ్డి
- 748మంది టిటిడి ఉద్యోగులకు కరోనా... ఐదుగురు మృతి
- టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడిగింపు: ఉత్తర్వుల జారీ
- టీటీడీలో రూ.50 కోట్ల పాతనోట్లు.. మార్పిడికి అవకాశం ఇవ్వండి ప్లీజ్.. కేంద్రమంత్రికి సుబ్బారెడ్డి వినతి
- తితిదే ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: అనిల్కుమార్ సింఘాల్
టీటీడీ క్యాలెండర్లు, డైరీలు సిద్ధం
2021వ సంవత్సరానికి సంబంధించి టీటీడీ క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి సిద్ధమవుతున్నాయి. 12 పేజీల ఆయిల్ ప్రింటెడ్ క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలతో పాటు కొన్ని టేబుల్ క్యాలెండర్లు సిద్ధమవుతున్నాయి.
వీటితో పాటు రూ.15 ధరతో శ్రీవారు, అమ్మవారి క్యాలెండర్లు, రూ.20 ధర కలిగిన తెలుగు పంచాంగం క్యాలెండర్లు కూడా తయారవుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు అందించేందుకు ఈ నెల 23న తిరుమలకు వస్తున్న సీఎం జగన్ చేతులమీదుగా వీటిని ఆవిష్కరింపజేయనున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా, తిరుమలలో ఏసీ గదుల అద్దెను టీటీడీ పెంచింది. ప్రస్తుతం రూ.1000 ఉన్న అద్దెను రూ.1500 చేశారు.
తర్వాతి కథనం
