1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (07:31 IST)

చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ : 17 యేళ్లనాటి బాబ్లీ కేసు కొట్టివేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. 17 యేళ్ళ నాటి బాబ్లీ కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా 23 మంది రాజకీయ నాయకులకు విముక్తి లభించింది.
 
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. 2005లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలతో చంద్రబాబు చేతులు కలిపారు. 
 
అయితే అక్కడ ధర్నాకు అనుమతి లేదని టీడీపీ నేతలు సూచించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చంద్రబాబు సహా టీడీపీ నేతలను అక్కడే ఓ గదిలో బంధించారు. అంతేకాకుండా చంద్రబాబు సహా 23 మంది టీడీపీ నేతలపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఇపుడు చంద్రబాబు, ఆయన అనుచరులకు విముక్తి లభించింది.