సంబంధిత వార్తలు
- ఎస్వీబీసీ భక్తి చానెల్లో పోర్న్ లింక్ వివాదం : మరో ఇద్దరిపై వేటు
- ఏపీలో ఆరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక
- తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో..: వర్మకు దివ్వవాణి కౌంటర్
- భయం గుప్పెట్లో దేశం.. గుంటూరూలో ఎటు చూసినా చితి మంటలే..
- నిన్న కొడుకు, నేడు తండ్రి: కరోనా కాటుకు కడపలో సాక్షి జర్నలిస్ట్ ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వరుస ఘటన
ఆకాశానంటుతున్న నిత్యావసరాల ధరలు
ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులకు బతుకు పెను భారంగా మారింది. దీనికి తోడు కరోనా మహమ్మారితో పనులు దొరక్క విలవిలలాడుతున్నారు. గత ఏడాది నిత్యావసరాలు కొంత మేర అందుబాటులో ఉండగా ఈ ఏడు రోజురోజుకు పెరిగిపోతూ కొనలేని పరిస్థితి నెలకొంది.
గత ఏడాది కందిపప్పు రూ. 80 ఉండగా ప్రస్తుతం రూ. 120 ఉంది. సనఫ్లవర్ ఆయిల్ గత ఏడాది రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 165, వేరుశనగ విత్తనాలు గతంలో రూ. 80 ఉండగా రూ. 120, ఎండు మిరపకాయలు రూ. 100 ఉండగా ప్రస్తుతం రూ. 180, మినపప్పు గతంలో రూ. 80 ఉండగా ప్రస్తుతం రూ. 120.
పెసలు గతంలో రూ. 60 ఉండగా ప్రస్తుతం రూ. 120, బెల్లం గతంలో రూ. 40 ఉండగా ప్రస్తుతం రూ. 55, శనగపప్పు గతంలో రూ. 60 ఉండగా ప్రస్తుతం రూ. 80 ఉన్నాయి. వీటికి తోడు పెట్రోలు డీజల్, గ్యాస్ అను నిత్యం పెరగడం వల్ల వీటి ప్రభావం నిత్యావసరాలపై పడి పేదప్రజల జీవితాలు కడు దుర్భరంగా మారాయి.
