బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:18 IST)

అమ్మా... నన్ను అపార్థం చేసుకున్నారు, నా రక్తంలో పోరాటముంది: రోజా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అయేషా మీరా తల్లి. సరిగ్గా 12 సంవత్సరాలకు ముందు అయేషా మీరాను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 
 
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో టిడిపి మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు రోజా. అప్పట్లో రోజా తీవ్రంగా స్పందించారు. అదలావుంటే అయేషా తల్లి మాట్లాడుతూ... నా కుమార్తె హత్య కేసులో సత్యం బాబు నిందితుడు కాదని నేను నెత్తి నోరు మొత్తుకున్నా. పట్టించుకోలేదు. నా కుమార్తె హత్య వెనుక రాజకీయ నేతల హస్తముంది. ఆ విషయం రోజాకు తెలుసు. కానీ ఆమె బయటకు చెప్పలేదు.
 
ప్రస్తుతం వారి పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు రోజా స్పందించాలి అంటూ ఆరోపించారు అయేషా మీరా తల్లి. దీనిపై తీవ్రంగా స్పందించారు రోజా. అయేషా మీరా తల్లిని... అమ్మా అంటూ సంబోధించిన రోజా, నా రక్తంలోనే పోరాటముంది. ఎక్కడ అమ్మాయికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించే తత్వం నాది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
 
మీరు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు అంటున్నారు రోజా. ఎప్పుడైనాసరే మహిళల కోసం పోరాటం చేసే వారిలో నేను ముందువరుసలో ఉంటానని చెప్పారు రోజా.