1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (11:24 IST)

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు బలి

road accident
ఏపీలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. అన్నమయ్య జిల్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లాలోని పీలేరు జిల్లాలోని ఎంజేఆర్ కాలేజీ వద్ద ఆగి వున్న లారీని వాహనం ఢీకొంది. 
 
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది వున్నట్లు పోలీసులు తెలిపారు.