బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (22:14 IST)

ఉగాది రోజునా పస్తులేనా? ఉద్యోగులకు పడని వేతనాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీంగా మారుతోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఠంచనుగా నెలలో ఆఖరు తేదీన వేతనాలు జమ అయ్యేవి. కానీ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెలాఖరులో వేతనాలు జమ చేసిన సందర్భాలు చాలా చాలా అరుదు. ఈ నెల కూడా అదే విధంగా జరిగింది. 
 
శనివారం తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ. దీంతో ఈ నెలలో అయినా సకాలంలో జీవితాలు పడతాయని ఉద్యోగులంతా ఎదురు చూశారు. కానీ, ఏప్రిల్ ఒకటో తేదీ అయిన శుక్రవారం ఏ ఒక్క ఉద్యోగికి కూడా వేతనం జమకాలేదు. ఇందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం కాదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. 
 
కొత్తగా తలెత్తిన సమస్య కారణంగా ఈ నెల 6, 7వ తేదీల్లోగానీ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం ఉంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే... గత తెదేపా ప్రభుత్వ హయాంలో సీఎఫ్ఎంఎస్ పేరిట కొత్త తీసుకొచ్చిన విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తూ వ్చారు. అయితే ఇపుడు వైకాపా ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌‍ను మార్చేసి, తెదేపా ప్రభుత్వం కంటే ముందున్న హెచ్ఆర్ఎంఎస్ విధానం ద్వారానే వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
ఇందుకోసం పేరోల్ పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్ను తీసుకొచ్చింది. ఈసాఫ్ట్‌వేర్ ఇంకా ఆర్బీఐతో అనుసంధానం కాలేదు. అంతేకాకుండా పాత విధానంలో బిల్లు అప్‌లోడ్ ఇంకా పూర్తికాలేదు. హెచ్ఆర్ఎంఎస్ విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా కొనసాగుతోంది. అది పూర్తయ్యేందుకు కనీసం ఈ నెల 5వ తేదీ వరకు సమయం పట్టేలా ఉంది. ఈ లెక్కల ఈ నెల 6 లేదా 7 తేదీల్లో ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.