1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 13 ఆగస్టు 2021 (20:52 IST)

నన్ను చంపేస్తానంటున్నారు కాపాడండి: వైఎస్ వివేకా కూతురు

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనంగా మారుతోంది. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడిగా ఉన్న యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తు వివేకా ఇంటిలోనే ఆయన హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
అసలు ఈ హత్య వెనుక అసలు కారణం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు సొంత చిన్నాన్న చనిపోతే ముఖ్యమంత్రి ఆ కేసును ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా వై.ఎస్. వివేకానందరెడ్డి కుమార్తె వై.ఎస్. సునీత కడప జిల్లా కలెక్టర్‌ను కలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
అంతేకాదు రాతపూర్వకంగా అసలు ఏం జరుగుతుందోనన్న విషయాన్ని స్పష్టంగా రాసిచ్చింది. నా తండ్రి హత్యపై అనేక రకాల అనుమానాలున్నాయి. ఈ కేసులో నన్ను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని అనుమానంగా ఉంది. నా ప్రాణాలను కాపాడండి.. నన్ను రక్షించండి అంటూ కడప జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు వై.ఎస్. సునీత.
 
ఇప్పటికే వ్యక్తిగత సిబ్బందిని బాడీగార్డ్‌ను వెంట పెట్టుకుని తిరుగుతున్నారు వై.ఎస్.సునీత. ఎస్పీని కలిసిన తరువాత ఎలాంటి భద్రత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది. అయితే వివేకా హత్యకు సంబంధించి నిందితుడిని పట్టుకున్న తరువాత ఆయన కుమార్తె ఎస్పీని కలవడం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది.