1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (11:44 IST)

సిజేరియన్‌ చేస్తూ కత్తెరను మరిచిపోయారు.. బాలింతకు ఏమైందంటే?

operation
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సిజేరియన్‌ ద్వారా ప్రసవించిన ఓ గర్భిణి కడుపులోనే కత్తెరను మరిచి వదిలేశారు వైద్యులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
ఒక వారం క్రితం డెలివరీ కోసం గర్భిణీ మహిళ ఆసుపత్రిలో చేరింది. సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ నిర్వహించిన సిజేరియన్‌ ఆపరేషన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ వరకు బాగానే వుంది కానీ ఆపరేషన్ అయ్యాక కుట్లు వేసే క్రమంలో వైద్యులు బాలింత కడుపులోనే కత్తెరను మరిచిపోయారు.  
 
అయితే కడుపులో నొప్పి వేధించడంతో ఆ మహిళ తిరిగి ఆస్పత్రికి చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌లో ఆమె కడుపులో కత్తెర వుండటాన్ని గమనించారు. 
 
ఆసుపత్రికి చెందిన ఓ ఉద్యోగి తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో ఎక్స్-రే ఫోటోను షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు.