1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (18:06 IST)

మీరు రాజీనామా చేసి మ‌ళ్లీ గెల‌వండి, టీడీపీ మూసేస్తాం!

మోసం చేశారు... అందుకే గెలిచారంటూ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో వైసీపీ గెలుపును ఎద్దేవా చేశారు.  విశాఖలో మోసం చేసి గెలిచారు, దాచేపల్లిలో అనేక ఇబ్బందులు పెట్టార‌ని అయ‌న విమ‌ర్శించారు. దాచేపల్లిలో 2, 3 స్థానాల ఫలితాలు తారుమారు చేశార‌ని, మ‌రి దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లిలో వైసీపీ ఎందుకు గెలవలేద‌ని ప్ర‌శ్నించారు. బుగ్గన సొంత వార్డులో టీడీపీ గెలిచింద‌ని, ఈ ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో మార్పు వచ్చింద‌న్నారు. త‌మ‌కు 12 శాతం ఓట్లు పెరిగాయ‌ని అచ్చెన్నాయుడు ధీమా వ్య‌క్తం చేశారు.
 

 
జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే ఎలా వెళ్తారు? అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. అస‌లు కుప్పం గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేద‌ని, ప్రభుత్వం, పోలీసులు, డబ్బు పంపిణీ వల్లే కుప్పంలో గెలుపు వ‌చ్చింద‌న్నారు. మంత్రులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేట‌ని, దొంగ ఓట్లతో గెలిచి మంత్రులు బోకేలు ఇచ్చుకోవడం దారుణం అన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నాం అని, వైసీపీతో హోరాహోరీ ఫైట్ చేశాం అని చెప్పారు. 

 
అస‌లు ఈ డీజీపీ లేకపోతే వైసీపీ గెలిచేది కాద‌ని, కొద్ది రోజుల్లో చంద్రబాబు అసలు సినిమా చూపిస్తార‌ని అన్నారు. ఈ 7 నెలల్లో టీడీపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింద‌ని, మంత్రి వెల్లంపల్లికి దమ్ముంటే రాజీనామా చేసి మ‌ళ్ళీ గెలవగలరా? అని ప్ర‌శ్నించారు. వైసీపీ నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాల‌ని, మీరు మళ్లీ గెలిస్తే మా పార్టీ మూసేస్తాం అని స‌వాలు చేశారు. వ్యవస్థల్ని వైసీపీ నిర్వీర్యం చేస్తోంద‌ని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంద‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
చెప్పారు.