గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (18:06 IST)

తప్పు చేసినట్టు రువుజు చేసి ఈ చెప్పుతో కొట్టండి : పృథ్వీ రాజ్

తాను తప్పు చేసినట్టు రుజువైతే ఈ చెప్పుతో కొట్టండి అంటూ సినీనటుడు, వైకాపా నేత, తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ గిరికి రాజీనామా చేసిన పృథ్వీ రాజ్ అన్నారు. రైతులంటే బురదలో ఉంటారనీ, బంగారు గాజులు వేసుకుని మొబైల్ ఫోన్స్ చేతబట్టుకుని ఉండరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పృథ్వీరాజే ఎస్వీబీసీ ఛానెల్‌లో పని చేసే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన వీడియో లీక్ కీవడంతో రాసలీలల బురదలో చిక్కుకుని ఛైర్మన్ పదవిని కోల్పోయాడు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తనను దెబ్బతీసేందుకు కొంతమంది అనేక రకాలుగా ప్రయత్నించారని ఆరోపించాడు. ఫేక్‌ వాయిస్‌తో తనపై దుష్ప్రచారం చేశారని, తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు. తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగానని దుష్ప్రచారం చేశారని చెప్పాడు. తనకు మందుతాగే అలవాటు లేదని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో తాగానని నిరూపితమైతే ఈ చెప్పుతో కొట్టండని తన కాలికి ఉన్న చెప్పును తీసి మీడియా మైకుల ముందు పృథ్వీ పెట్టడంతో మీడియా ప్రతినిధులు విస్తుపోయారు.