గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:16 IST)

పోలీసు కాళ్ళు మొక్కాలని వుంది.. ఆ బుల్లెట్లు దాచుకోవాలని వుంది..

గ‌త నెల 27న పశువైద్యురాలు దిశ‌ని అత్యాచారం చేసి అనంత‌రం హ‌త్య చేసిన న‌లుగురు నిందితులు ఆరిఫ్‌, శివ‌, న‌వీన్, చెన్న‌కేశ‌వులు పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో భాగంగా చ‌టాన్ ప‌ల్లి ఘ‌ట‌నా స్థ‌లానికి నిందితుల‌ని తీసుకురాగా, వారు ఎదురు దాడి చేయ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశామని పోలీసులు చెపుతున్నారు. 
 
అయితే ఈ ఎన్‌కౌంట‌ర్‌పై దిశ త‌ల్లిదండ్రుల‌తో పాటు యావత్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. సినీ సెల‌బ్రిటీలు జూనియ‌ర్ ఎన్టీఆర్, నాగార్జున‌, స్మిత‌, మంచు మ‌నోజ్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. న్యాయం జ‌రిగింది. దిశ ఆత్మకి శాంతి చేకూరుతుంది అని అంటున్నారు. 
 
ముఖ్యంగా, మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
'ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది.
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!' అంటూ ట్వీట్ చేశారు.