ఈ నె 24వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇవి అక్టోబరు 2వ తేదీ వరకు జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అశోక్ సింఘాల్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. అన్నమయ్య భవన్లో ఈవో అధ్యక్షతన జరిగిన శాఖలవారీ సమీక్షా సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి...