శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (12:31 IST)

కాణిపాకం రథ చక్రాలకు నిప్పుపెట్టిన దుండగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలకు, వాటి రథాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. గత రెండున్నరేళ్ళ కాలంలోనే వందల సంఖ్యలో హిందూ ఆలయాలు ధ్వంసానికి గురయ్యాయి. 
 
తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం ఆలయంల మరో దారుణం జరిగింది. ఈ ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రథ చక్రాలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఆలయ గోశాల పక్కన ఉంచిన ఈ రథ చక్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే, ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేశారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.