ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 7 జులై 2021 (22:53 IST)

ఎపిలో 30 లక్షల మంది సొంతింటి కలను సాకారం చేస్తున్నాం: రంగనాథ్ రాజు

రాష్ట్రంలో 30లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేలా ప్రణాళికలు చేపట్టామన్నారు ఎపి గృహనిర్మాణ శాఖామంత్రి రంగనాథ్ రాజు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్సించుకున్నారు. ఈ సంధర్భంగా ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతి నాలుగు ఇళ్ళలో ఒక ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.
 
కేంద్ర ప్రభుత్వం ఒక ఇంటికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి సమారు 5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల రూపాయల విలువ చేసే స్ధలాన్ని కూడా ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు ఇళ్ళు కట్టుకునేందుకు 60 వేల ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పారు. అనుకున్న సమయంలోగా ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుందన్నారు.
 
అనంతరం తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామిలతో కలిసి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.