ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:04 IST)

ప్రియుడితో భార్య పారిపోయింది... భర్త ఏం చేశాడంటే?

వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్న ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మనస్థాపానికి గురైన భర్త ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తాగాడు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
 
కురబలకోట మండలం తెట్టు పంచాయతీ, ఎలకలవారి పల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్బయ్య అతని భార్య వెంకటమ్మలు గ్రామానికి సమీపంలోని బండలపై రాయిపనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. సుబ్బయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తనతో పాటు పనిచేస్తున్న ఒక వ్యక్తితో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. అయితే ఆమె వినిపించుకోలేదు. తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెంకటమ్మ. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేష్‌ తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తాను విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.