1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YCP MLA Vasanth Krishna Prasad to Join TDP

టీడీపీలో చేరేందుకు సిద్దమైన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ

ysrcp flag
మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తర్వాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. ‘సిద్దం’ సమావేశానికి తాను హాజరు కాబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌ జోక్యంపై వసంతకృష్ణ ప్రసాద్‌ గతంలోనే సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని సీఎం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
 
మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే నారా లోకేష్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ శుక్రవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, పనులు పూర్తి చేసిన పార్టీ నాయకులు తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
తర్వాతి కథనం
కుక్కపిల్లను నేలపై విసిరిన చిన్నారి.. వీడియో వైరల్