1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేతిబీరలో నెయ్యి ఎంత ఉంటుందో.. వైకాపా సామాజిక న్యాయం అంతేవుంది : వైకాపా ఎమ్మెల్సీ

janga krishnamurthy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. అధికార పార్టీలో రెబెల్ ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించారు. తమ వైకాపాలో సామాజిక న్యాయం అనేది లేదన్నారు. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వైకాపాలో సామాజిక న్యాయం కూడా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
పార్టీలోని బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. గౌరవ మర్యాదలు మచ్చుకైనా కనిపించవన్నారు. ప్రోటోకాల్‌కు అనే మాటకే తావు లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు తమ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీలు పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైకాపా పెద్దలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
ముఖ్యంగా గత నాలుగున్నరేళ్ళ కాలంలో బీసీలకు పదవులు ఇచ్చారు. కానీ, అధికారం ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. కీలక పదవులన్నీ ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని, బీసీలకు నామమాత్రంగా కూడా అధికారాలు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగానే కాకుండా, వైకాపా బీసీ విభాగం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇపుడు ఈయన పార్టీకి వ్యతిరేకంగా గళం వినిపించడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.