గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (16:51 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

magunta srinivasulu reddy
ఢిల్లీ మద్యం స్కామ్‌లో వైకాపాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అందులో ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
 
మద్యం కేసులో గురువారం అరుణ్‌ పిళ్లైని కోర్టులో హాజరు పరిచిన అధికారులు.. ఐదు రోజుల పాటు కస్టడీకి కోరారు. ఇతర నిందితులతో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలుపగా.. 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
 
అలాగే, కొందరు నిందితులు, సాక్షులను కలిపి ప్రశ్నిస్తున్నామని చెప్పిన ఈడీ అధికారులు.. కొందరిని మళ్లీ విచారణకు పిలిచినట్టు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా గురువారం విచారణకు ఎమ్మెల్సీ కవిత రాలేదని కోర్టుకు ఈడీ సమాచారం ఇచ్చింది. 
 
పిళ్లై కస్టడీ పొడిగిస్తే శుక్రవారం బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నిస్తామంది. ఈ కేసులోనే వైకాపా ఎంపీ శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం కేసు మూలాలు ఏపీలోనే ఉన్నట్టు తెలుస్తుంది.