1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Youth Dies During Army Recruitment Rally In Kakinada

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

suicide
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయి కిరణ్ అనే 20 ఏళ్ల యువకుడు మంగళవారం కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొంటూ మరణించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. 1,600 మీటర్ల పరుగు తర్వాత శ్వాసకోశ సమస్యల కారణంగా సాయి కిరణ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు సమాచారం. సాయంత్రం తరువాత మరణించినట్లు పోలీసులు తెలిపారు. 
 
రైతు అప్పల నాయుడు, భారతి దంపతుల కుమారుడు అయిన సాయి కిరణ్ ఇటీవల డిగ్రీ పరీక్షలలో అర్హత సాధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ ర్యాలీలో తమ కుమారుడు మరణించడం పట్ల రోదిస్తున్నారు. ర్యాలీలో కుప్పకూలిన తమ కొడుకుకు సరైన వైద్యం అందలేదని, అందుకే అతను మరణించాడని ఆరోపించారు.
తర్వాతి కథనం
అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ