సంబంధిత వార్తలు
- బైకు కొనివ్వలేదని తండ్రిపై గొడ్డలితో దాడి... తీవ్ర గాయాలు...
- వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు
- ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం
- వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..
- ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయి కిరణ్ అనే 20 ఏళ్ల యువకుడు మంగళవారం కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటూ మరణించాడు.
వివరాల్లోకి వెళితే.. 1,600 మీటర్ల పరుగు తర్వాత శ్వాసకోశ సమస్యల కారణంగా సాయి కిరణ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని అంబులెన్స్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు సమాచారం. సాయంత్రం తరువాత మరణించినట్లు పోలీసులు తెలిపారు.
రైతు అప్పల నాయుడు, భారతి దంపతుల కుమారుడు అయిన సాయి కిరణ్ ఇటీవల డిగ్రీ పరీక్షలలో అర్హత సాధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ ర్యాలీలో తమ కుమారుడు మరణించడం పట్ల రోదిస్తున్నారు. ర్యాలీలో కుప్పకూలిన తమ కొడుకుకు సరైన వైద్యం అందలేదని, అందుకే అతను మరణించాడని ఆరోపించారు.
