1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan criticizes AP government for not introducing budget

"ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"పై మండిపడిన వైకాపా అధినేత జగన్

Jagan
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్. జగన్ ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 
 
ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడు నెలల వ్యవధిలోనే "ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"ను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని జగన్ అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు జరుగుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న అధికార టీడీపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది.
తర్వాతి కథనం
తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టుగా ఏపీ అప్పులు వెలుగు చూస్తున్నాయి : సీఎం చంద్రబాబు