1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (08:42 IST)

దావోస్ బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

ysjagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం దావోస్ బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యే ఏపీ బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహిస్తారు. 
 
ఈ పర్యటన కోసం ఇప్పటికే హైదరాబాద్ నాంపల్లి కోర్టు నుంచి సీఎం జగన్ అనుమతి తీసుకున్నారు. దీంతో ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. 
 
ఆయన సాయంత్రానికి జ్యూరిచ్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జగన్ బృదం దావోస్ చేరుకుంటుంది. సీఎం జగన్ మొత్తం పది రోజుల పాటు విదేశీ పర్యటనలోనే ఉంటారు.