శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కర్నూలు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్

ysjagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాకు ఆయన విచ్చేయనున్నారు. ఇక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా ఓ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం జగన్ వస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అధికారంగా ఓ ప్రకటన చేశారు. దీంతో సీఎం జగన్ పర్యటన కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు... 
 
మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. ఆ తర్వాత ఉదయం పది గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 
 
ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు ఉదయం 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11.15 గంటలకు గుమ్మటం తండా హెలిప్యాడ్‌కు హెలికాఫ్టరులో వస్తారు. ఓ 15 నిమిషాల పాటు స్థానిక నేతలతో మాట్లాడుతారు. 
 
ఆ తర్వాత 11.35 గంటలకు రోడ్డు మార్గంలో ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత 11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 
 
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు చేరుకుని 12.50 గంటలటకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుంటారు. ీ