1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (10:55 IST)

నేడు కర్నూలు జిల్లా పర్యటనకు సీఎం జగన్

ys jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుమ్మటం తాండా వద్ద ఇంటగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. శంకుస్థాన కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 
 
కాగా, ఈ ప్రాజెక్టు గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుంది. 5230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ముఖ్యంగా ఒక్క యూనిట్ నుచి మూడు విభాగాల ద్వారా మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.