1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:44 IST)

ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యాను : ఎమ్మెల్యే ఆర్కే.రోజా

తాను ప్రజల మధ్యే ఉంటానని, ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని నగరి వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా ప్రకటించారు. పనిలోపనిగా టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాష్ నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తాను అక్రమంగా సంపాదిస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మూతిపగిలిపోతుందని హెచ్చరించారు. తన బ్యాంకు బ్యాలెన్స్‌ను బహిర్గతం చేస్తానని, వైకాపాలో ఉన్నవారి అండదండలోత తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని ఆమె సెటైర్లు వేస్తున్నారు. 
 
కాగా, నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలో ఎమ్మెల్యే రోజాకు వాటాలు అందుతున్నాయని భానుప్రకాష్ నాయుడు ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా అండతో కొందరు నగరి సంపదను కొల్లగొడుతున్నాని, ఆంబోతుల్లా నగరిమీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. వీటికి రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.