అమరావతి అంతా గ్రాఫిక్స్... అదే చంద్రబాబు చేసిన అభివృద్ధి : విజయసాయి రెడ్డి

గురువారం, 2 జనవరి 2020 (21:17 IST)
అమరావతి అభివృద్ధిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ చేశారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ముఖ్యంగా, గ్రాఫిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం ఓ ట్వీట్ చేశారు. 2014-19 మధ్య 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. టీడీపీ నేతలు, రియల్టర్స్ అమరావతిలో ఎస్సీ, ఎస్టీలు, రైతుల నుంచి అక్రమంగా భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. 
 
రాజధాని అమరావతికి గత ప్రభుత్వం చేసింది ఏదైనా ఉందంటే.. అది భూసేకరణ కుంభకోణం, ఇన్‌సైడర్ ట్రేడింగ్, గ్రాఫిక్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై వ్యాఖ్యలు చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

అన్నీ చూడండి

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments