నారింజ రసం, పాలపొడి ముఖానికి పట్టిస్తే..?

సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:17 IST)
చాలామంది అందానికే టైమ్ అంతా వృధా చేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా బ్యూటీపార్లర్‌లోనే కూర్చుని ఉంటారు. ఇలాంటి వారికి ఒక్కోసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లే సమయం దొరకనప్పుడు ఇంట్లో లభించే సాధనాలతోనే తేలిగ్గా 10 నిమిషాల్లో తాజాగా కనిపించవచ్చు.. ఎలాగో తెలుసుకుందాం రండీ..
 
సౌందర్య పోషణలో నిమ్మరసం ప్రత్యేకత ఎంతో ఉంది. ముఖంపై నల్లటి మచ్చలు, తెల్లటి మచ్చలను, చర్మరంధ్రాలను తొలగిస్తుంది. మొటిమల నివారణకు నిమ్మ ఎంతో దోహదపడుతుంది. స్పూన్ నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. అలానే నిమ్మరసంలో రెండు మూడు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.
 
ఓ చిన్న టమోటాని తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలతో ముఖాన్ని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ఓ స్పూన్ నారింజ రసంలో కొద్దిగా పాలపొడి, గంధం, తేనె వేసి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా నిగనిగలాడుతుంది.   

అన్నీ చూడండి

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి

జూలై 19, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

అన్నీ చూడండి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

తర్వాతి కథనం
Show comments