1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (15:43 IST)

ముంబైలో ప్రారంభమైన యాపిల్ తొలి స్టోర్

apple store
స్మార్ట్ ఫోన్లలో అత్యంత ఖరీదైన ఫోనుగా గుర్తింపు పొందిన యాపిల్ ఐఫోన్‌ ఇపుడు తన స్టోర్‌ను భారత్‌లో కూడా ప్రారంభించింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టి 25 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశీయ మార్కెట్‌లో మరింతగా పట్టు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించింది.
 
భారత్‌లో సంస్కృతితో పాటు అద్భుతమైన శక్తిని కలిగివుందని, కస్టమర్లకు దీర్ఘకాలిక సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. 2022-23 ఆర్థిక సంపత్సరంలో భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన మొబైళ్లు విదేశాలకు ఎగుమతి అయ్యాని ఆయన తెలిపారు.