శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (11:46 IST)

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ బైక్ సంస్థలతో డీల్

electric scooter
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ వాహనాలను అందించనుంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ బైక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
అంతేగాకుండా ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు వీలుగా ఆప్కాబ్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఆర్థిక సాయం చేస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇంకా ఓలా, హీరో, బిగాస్, కైనటిక్, ఆథర్, టీవీఎస్ వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ సర్కారు. ఇకపోతే.. ఏడాదిలో ఏపీ సర్కారు ఉద్యోగులకు లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్‌ను నెడ్‌క్యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.