1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:54 IST)

కేంద్రం దెబ్బకు దిగిరానున్న వంట నూనెల ధరలు

దేశ వ్యాప్తంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగి, వంట నూనెల ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముడిపామాయిల్ దిగుమతి సుంకాన్ని 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అలాగే, ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ యేడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగియనుండగా దీన్ని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడగించింది. ఇక సెస్ తగ్గింపు, ముడిపామాయిల్ దిగుమతి పన్నుల మధ్య అంతరం పెరుగుతుంది. దీంతో దేశంలోని రిఫైనర్లకు పామాయిల్ మరింత చౌకగా దిగుమతి కానుంది.