మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2019 (17:29 IST)

రిలయన్స్ జియో నుంచి న్యూస్ యాప్...

హైదరాబాద్: రిలయన్స్ జియో సొంత ప్లాట్ ఫామ్ పైన జియో న్యూస్ వెబ్ ఆధారిత సర్వీసును ప్రారంభించింది. ఇది మొబైల్ అప్లికేషన్స్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్, జియో మ్యాగ్స్, జియో న్యూస్ పేపర్స్‌తో పాటు లైవ్ టీవీ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
 
బ్రేక్కింగ్ న్యూస్, 150కి పైగా చానెల్స్ ప్రత్యక్ష ప్రసారాలు, వీడియోలు, 800కు పైగా మ్యాగజైన్లు, 250కి పైగా వార్త పత్రికలు ఇందులో లభిస్తాయి. ఇందులో 12కు పైగా భారతీయ భాషల నుంచి నచ్చినవి ఎంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) టెక్నాలజీ ద్వారా యూజర్‌కు ఇష్టమైన కంటెంట్‌ను అందిస్తుంది.
 
ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని జియో తెలిపింది.