1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Rising oil prices again

మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎంతంటే..

oil prices
రాష్ట్రంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది.
 
రాష్ట్రంలో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్రపట్టనివ్వడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల పెట్రోల్​ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటింది.
 
తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది. ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.96, డీజిల్‌ రూ.98.01 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది.
 
అలాగే విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.76, డీజిల్‌ రూ.97.91 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.22గా ఉంది.
About Writer
ఎం
తర్వాతి కథనం
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 370మంది మహిళలను.. అలా నగ్నంగా..?