స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడి ఆరో అంతస్తు నుంచి దూకేసిన టెక్కీ... ఎక్కడ?
తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం జరిగింది. స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడిన వెంటనే ఓ టెక్కీ ఏమైందో ఏమోగాని తానుంటున్న భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలలోకి వెళితే.. నామక్కల్ జిల్లాకు చెం
తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణం జరిగింది. స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడిన వెంటనే ఓ టెక్కీ ఏమైందో ఏమోగాని తానుంటున్న భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలలోకి వెళితే.. నామక్కల్ జిల్లాకు చెందిన ఎం.గంగాదేవి (22) కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్లో టెస్ట్ ఆపరేటర్గా పని చేస్తోంది.
ఆదివారం సాయంత్రం బెంగళూరులో ఉండే తన స్నేహితురాలితో ఫోన్లో కాసేపు ముచ్చటించింది. అనంతరం ఆమె నివాసముంటున్న అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కన ఉండే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంగాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకోవడానికి వెనుక గల కారణాలపై అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా పోలీసులు గంగాదేవి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు మాట్లాడిన గంగాదేవి స్నేహితురాలిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.