మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (16:21 IST)

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా.. ఆర్బీఐ చెప్పేదేమిటంటే?

కరోనాతో పాటు ఇతరత్రా వైరస్‌లు కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించే అవకాశం వుందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. గత మార్చి 9వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాసిన లేఖలో.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తించే అవకాశం వుందని తెలిపింది. 
 
కరోనా మాత్రమే కాకుండా బ్యాక్టీరియాలు, వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతాయా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ఈ లేఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపింది. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌తో పాటు బ్యాక్టీరియాలు కూడా వ్యాపించే అవకాశం వుందని తెలిపింది. 
 
అందుచేత కరోనాను నియంత్రించేందుకు కరెన్సీ వినియోగాన్ని తగ్గించుకుని డిజిటల్ లావాదేవీలను చేయాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఇంకా ప్రజలు అనవసరంగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసుకోవద్దని.. అనేక ఆన్‌లైన్ వసతుల ద్వారా నగదు లావాదేవీలను జరపాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.