1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:14 IST)

[email protected] కోట్లు.. ఈ రోజు కొత్త కరోనా కేసులెన్ని?

దేశంలో కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58.82 కోట్ల మందికిగా పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర కుంటుంబ, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం రాత్రి 7 గంటల వరకు అందిన క సమాచారం మేరకు 56,10,116 మోతాదులు అందజేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఈ నెల 23 నాటికి టీకా డ్రైవ్‌ 220వ రోజుకు చేరింది. సోమవారం 39,62,091 మంది లబ్ధిదారులకు మొదటి డోస్‌ ఇవ్వగా.. 16,48,025 మంది రెండో మోతాదు ఇచ్చినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌ ప్రారంభించిన నాటి నుంచి 58,82,21,623 డోసులు పంపిణీ చేయగా.. ఇందులో 45,55,21,465 మందికి తొలి.. మరో 13,27,00,158 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
 
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 25,467 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 39,486 మంది కోలుకున్నారు. 
 
సోమవారం 354 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,20,112 మంది కోలుకున్నారు. 3,19,551 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.