1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (10:21 IST)

బుసలు కొడుతున్న ఒమిక్రాన్ వైరస్ - 961కి చేరిన పాజిటివ్ కేసులు

ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తు ఒమిక్రాన్ వైరస్ మన దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తుంది. ఫలితంగా రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా చేసిన ప్రకటన మేరకు ప్రస్తుతం దేశంలో 961 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీటిలో ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, రాజస్థాన్‌లో 69, గుజరాత్‌లో 97, కేరళలో 65, తెలంగాణాలో 62, తమిళనాడులో 45 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, కరోనా పాజిటివ్ కేసులు కూడా గత రెండు రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం 13,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 268 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మంగళవారం నమోదైన 9,155 కేసులతో పోల్చితే బుధవారం నమోదైన కోవిడ్ కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపించింది. సోమవారం ఈ కేసులు కేవలం 6,242 మాత్రమే కావడం గమనార్హం. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 3900 కేసులు వెలుగు చూడగా, కేరళలో 2846 కేసులు, బెంగాల్‌లో 1089 కేసులు, ఢిల్లీలో 923, తమిళనాడులో 739 చొప్పున కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మినహా దేశ వ్యాప్తంగా 185 రాష్ట్రాల్లో కేసులు అంతకుముందు రెండు రోజులతో పోల్చితే రెట్టింపు కావడం గమనార్హం.