1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (11:46 IST)

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 22,775 కేసులు నమోదు

దేశంలో తాజాగా 22,775 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో క్రియాశీల కేసుల సంఖ్య 1 లక్ష దాటింది.
భారత్‌లో 24 గంటల వ్యవధిలో రోజువారీ కోవిడ్‌ కేసులు 22,775కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
 
 
అదే సమయంలో 406 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకూ కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,81,486కు చేరుకుంది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.30 శాతం ఉన్న యాక్టివ్ కేసులు 1,04,781కి పెరిగింది.


ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 1,431కి పెరిగింది. ఈ కేసులలో 488 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లను నివేదించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 
గత 24 గంటల్లో 8,949 మంది రోగులు కోలుకోవడంతో వారి సంఖ్య 3,42,75,312కి పెరిగింది. ఫలితంగా భారతదేశంలో రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది.
 
 
 
ఇదే కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 11,10,855 పరీక్షలు జరిగాయి. కేసులు ఆకస్మికంగా పెరుగుతుండటంతో వారపు పాజిటివిటీ రేటు 1.10 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 58,11,587 వ్యాక్సిన్ డోస్‌లు వేయడంతో శనివారం ఉదయం నాటికి దేశంలో కోవిడ్ టీకాలు 145.16 కోట్లకు చేరుకుంది.