1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (10:13 IST)

జూన్ 24న దేశంలో కరోనా పాజటివ్ కేసులెన్ని?

దేశంలో కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన మేరకు.. గత 24 గంటల్లో 54,069 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. దాని ప్రకారం బుధవారం 68,885 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,321 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,91,981కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,90,63,740 మంది కోలుకున్నారు. 6,27,057 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,16,26,028 వ్యాక్సిన్ డోసులు వేశారు.  
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,78,32,667 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గత 24 గంటల్లో 18,59,469 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.