Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 15 జూన్ 2022 (10:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపించినప్పటికీ బుధవారం మాత్రం మళ్లీ పెరిగిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం 6594 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం గణాంకాల ప్రకారం 8822 కేసులు పెరిగాయి. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం 33.7 శాతం మేరకు పెరిగాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,32,45,517గా ఉంది. 
 
అలాగే, 4,26,67,008 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 5,24,792 మంది మరణించారు. బుధవారం కరోనా వైరస్ బాధితుల్లో 15 మంది చనిపోయారు. 5718 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. 

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments