శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (13:23 IST)

కోహ్లి సేన చారిత్రక విజయం కోసం 2 వికెట్లు...

బుమ్రాంగ్ నిన్న సంచలన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాట్సమన్ల పైన విరుచుకుపడుతున్నారు. ఈ టెస్టులో కోహ్లి సేన విజయం నల్లేరుపై నడకలా సాగుతోంది. 
 
భారత్ బౌలర్ల ధాటికి వరుసగా ఆసీస్ వికెట్లు పడిపోతున్నాయి. ఆసీస్ జట్టు 85 ఓవర్లకు 258 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దీనితో కోహ్లి సేన విజయానికి మరో రెండంటే రెండు వికెట్లు దూరంలో వుంది. ఆ వికెట్లు లాగేశారంటే చారిత్రక విజయం కోహ్లి సేన సొంతం.