గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (09:45 IST)

కోల్‌కతా ట్వంటీ20 : కాస్త కష్టంగా లక్ష్యఛేదన.. భారత్ బోణీ

కోల్‌కతా వేదికగా జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 110 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కాస్త కష్టంగా ఛేదించింది. దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్‌), క్రునాల్‌ పాండ్యా (9 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్‌), మనీష్‌ పాండే (24 బంతుల్లో 2 ఫోర్లతో 19) కీలకంగా నిలిచారు. 
 
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. కుల్దీప్‌ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి నెగ్గింది. 
 
దీంతో మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా కుల్దీప్‌ యాదవ్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన క్రునాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌ అద్భుతంగా ఆకట్టుకున్నారు. రెండో టీ20 లోక్నోలో ఈనెల 6వ తేదీన జరుగనుంది.