గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 డిశెంబరు 2019 (21:05 IST)

వెడ్డింగ్ యానివర్శరీ జోష్‌లో కోహ్లి: 70 నాటౌట్, స్కోరు 240/3

టి20 పోటీల్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్లు ముంబైలో తలపడ్డాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఇన్నింగ్సులో టీమిండియా వెస్టిండీస్ బౌలర్లతో ఆడుకున్నారు. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేశారు. 
 
రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు, కెఎల్ రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశారు. భారీ అంచనాలతో క్రీజులో అడుగుపెట్టిన పంత్ డకౌటుగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 29 బంతుల్లో 70 పరుగులు చేసాడు. వీటిలో 7 సిక్సర్లు, 4 ఫోర్లు వున్నాయి. మొత్తమ్మీద కోహ్లి తన వెడ్డింగ్ యానివర్సిరీకి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.