మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:18 IST)

మిస్టర్ కూల్‌కి కోపమొచ్చింది.. ధోనీని చూసి జడుసుకున్న కుల్దీప్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్ అని పేరు సంపాదించాడు. అలాంటి వ్యక్తికి కోపమొస్తుందా...? అంటే అవుననే అంటున్నాడు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. జట్టు ఓటమి అంచుల్లో వున్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా విన్నింగ్ షాట్ కొట్టి గెలిపిస్తాడు. అలాంటి ధోని సహనం కోల్పోవడం తొలిసారిగా చూశానని తెలిపాడు. 
 
2017లో శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో కుశాల్ పెరీరా తన బౌలింగ్‌లో కవర్స్ మీదుగా బౌండరీ కొట్టాడు. దీనితో ఫీల్డింగ్ మార్చాలంటూ ధోని భాయ్ వికెట్ల వెనుక నుంచి అరిచాడు. కానీ ఆయన అరుపు తనకు వినిపించలేదు. యధావిధిగా తర్వాత బంతి వేశాను. ఈసారి రివర్స్ స్వీప్‌లో మళ్ళీ ఫోర్ బాదాడు. 
 
అప్పుడు ధోని భయ్యా తన వద్దకు వచ్చి.. ''నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా.. 300 వన్డేలు ఆడాను. నేను చెప్పే మాటను వినిపించుకోవట్లేదని'' ఫైర్ అయ్యాడు. ఆ రోజు ధోనిని చూసి చాలా భయపడ్డాను అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం ధోని దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పానని.. అప్పుడు ధోని 20 ఏళ్లుగా కోప్పడలేదని నవ్వాడంటూ కుల్దీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.