శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (18:22 IST)

కరోనా ప్రభావం ధోనీ కెరీర్‌పై పడుతుందా? ఐపీఎల్‌ జరగకపోతే ధోనీ పరిస్థితి ఏంటి?

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. రోనా తీవ్రత తగ్గకపోతే అసలు ఐపీఎల్ జరుగుతుందో లేదోనని కూడా అనుమానాలు మొదలవుతున్న నేపథ్యంలో.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్‌పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. 
 
ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి అనంతరం ధోనీ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు.
 
కాగా ఐపీఎల్‌లో సత్తాచాటితేనే ధోనీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో స్థానం సంపాదించుకుంటాడని ప్రధాన కోచ్ రవిశాస్త్రి గతంలో చెప్పిన నేపథ్యంలో.. కరోనా కారణంగా ఐపీఎల్‌ జరగకపోతే ధోనీ పరిస్థితి ఏంటి? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ధోనీని ఈ ఏడాది ఆసీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలంటే.. ఐపీఎల్‌లో ధోనీ సత్తా చాటాల్సిన పరిస్థితి. కానీ ఐపీఎల్ జరగకపోతే.. ఆయన్ని జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది అనుమానమే. 
 
కానీ ధోనీ పునరాగమనానికి ఐపీఎల్ వారధి కాదని క్రీడా పండితులు అంటున్నారు. ధోనీకి రావాలని వుండి.. సెలక్టర్లకు అందుబాటులోకి వస్తే.. అతడిని ఎవ్వరూ ఆపలేరని చెప్తున్నారు. ఎందుకంటే అతడికి అపారమైన అనుభవం వుంది. టీ20 ప్రపంచకప్‌లో అతడి అనుభవం కావాలనుకుంటే.. ఐపీఎల్‌ ఆడినా, ఆడకపోయినా అతడు జట్టులోకి వస్తాడని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.