సంబంధిత వార్తలు
చరిత్రలో నిలిచిపోనున్న రాజ్ కోట్ టెస్టు.. ఎన్నో విశేషాలు
Rajkot Test
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల క్లబ్లో చేరేందుకు 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 5 వికెట్లు పడగొడితే 700 వికెట్ల మైలురాయి అందుకోనున్నాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్ రెడీ అయ్యింది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. తొలి రెండు టెస్ట్ల్లో చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలోనే మూడో టెస్ట్లో విజయం సాధించి పై చేయి సాధించాలనుకుంటున్నాయి.
