మంగళవారం, 11 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (09:48 IST)

రిటైర్మెంట్ వార్తలు ఇక రాయొద్దు.. ప్లీజ్ : మీడియాను కోరిన రోహిత్ శర్మ (Video)

rohit sharma
తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టారు. తాను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదని, అలాంటి ఉద్దేశం కూడా తనకు లేదని చెప్పారు. అందువల్ల తన రిటైర్మెంట్ వార్తలను ఇకపై రాయొద్దని మీడియాను కోరారు. 
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసిన భారత్.. 12 యేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడారు. 
 
తన భవిష్యత్‌కు సంబంధించిన ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. అందువల్ల రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు. వన్డే ఫార్మెట్ నుంచి తాను ఇపుడే రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. సుధీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందని, అయితే, ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందన్నారు. 
 
ఇకపోతే, చాంపియన్స్ ట్రోఫీని మళ్లీ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ టోర్నీ మొత్తం తామంతా ఒక జట్టుగా బాగా ఆడినట్టు చెప్పారు. జట్టు తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. 2023 ప్రపంచ కప్ సమయంలో రాహుల్ ద్రవిడ్‌తో ఇపుడు గౌతం గంభీర్‌తో మాట్లాడానని అన్నాడు.
 
ఆదివారం నాటి మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్ల పాటు ఎలా ఆడాలో పూర్తి స్పష్టతతో ఉన్నానని, ఒకవేళ తాను ఔటైనా తమ ప్రణాళిక అమలు చేయాలని అనుకున్నామని వివరించారు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉండటం తమలో ఆత్మవిశ్వాసాన్న నింపిందని రోహిత్ చెప్పుకొచ్చాడు.